47 మందికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-01-20T06:10:59+05:30 IST

47 మందికి పాజిటివ్‌

47 మందికి పాజిటివ్‌

కాకతీయఖని, జనవరి 19: సింగరేణి  భూపాలపల్లి ఏరియాలో కరోనా విజృంభిస్తోంది. వారం రోజుల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగు తోంది. బుధవారం ఒక్కరోజే సింగరేణిలో 47 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. 111 మందికి పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు నిర్ధారణ అయ్యింది. 27 మంది కార్మికులు, 20 మంది డిపెండెంట్‌ కార్మికులు కరోనా బారిన పడినట్టు సింగరేణి వైద్యాధికారులు తెలిపారు.  మొత్తంగా ఏరియాలో ఇప్పటి వరకు  191 మం దికి వైరస్‌ సోకగా వీరిలో 82 మంది కార్మికులు, ఏడుగురు ఎగ్జిక్యూటివ్స్‌, 94 మంది డిపెండెంట్‌ ఎంప్లాయిస్‌, ముగ్గురు రిటైర్డ్‌ కార్మికులు, ఒక రిటైర్డ్‌ కార్మి కుడి డిపెండెంట్‌, నలుగురు కాంట్రాక్ట్‌ కార్మికులు ఉన్నట్లు వివరించారు.  

Updated Date - 2022-01-20T06:10:59+05:30 IST