ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సహా నలుగురికి నెగటివ్
ABN , First Publish Date - 2020-06-30T21:53:13+05:30 IST
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆయన భార్య పద్మలతారెడ్డి, గన్మ్యాన్, వంటమనిషి, ఇద్దరు డ్రైవర్లకు కరోనా నెగటివ్ వచ్చింది.
చేర్యాల(మెదక్): జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆయన భార్య పద్మలతారెడ్డి, గన్మ్యాన్, వంటమనిషి, ఇద్దరు డ్రైవర్లకు కరోనా నెగటివ్ వచ్చింది. ఈనెల11న ముత్తిరెడ్డికి, మరుసటిరోజున భార్య పద్మలతారెడ్డిసహా నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కాగా ఆదివారం రాత్రి అందరికీ నిర్ధారణ పరీక్షలు చేయగా, గాంధీ ఆస్పత్రి వైద్యులు పరిశీలించి నెగటెవ్ అని తేల్చారు. కాగా చేర్యాల అంగడిబజారులోని పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కలిసిన మద్దూరు మండలం సలాక్పూర్లోని ఐసీఐసీఐ బ్యాంకు అధికారి, సూపర్వైజర్ కొంత అస్వస్తతకు గురైనట్లు తెలిసింది. ఈ మేరకు వారు వైద్యపరీక్షలు చేయించుకునేందుకు హైదరాబాద్కు వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పటికే 27మంది హోంక్వారంటైన్లో ఉండగా, ఈ ఇద్దరితో 29కి చేరింది.