కరోనా రోగిని కలిస్తే చెప్పండి

ABN , First Publish Date - 2020-04-03T07:04:00+05:30 IST

ఢిల్లీలో జమాతేకు వెళ్లొచ్చిన గజ్వేల్‌ వాసిని కలిసిన వారు స్వచ్ఛందంగా అధికారులకు తెలపాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితోపాటు ఇత...

కరోనా రోగిని కలిస్తే చెప్పండి

అది సమాజానికి మేలు చేయడమే!.. 

ప్రజలంతా సహకరించాలి: మంత్రి హరీశ్‌రావు


గజ్వేల్‌, ఏప్రిల్‌ 2: ఢిల్లీలో జమాతేకు వెళ్లొచ్చిన గజ్వేల్‌ వాసిని కలిసిన వారు స్వచ్ఛందంగా అధికారులకు తెలపాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన స్థానిక ఆర్‌డీవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జమాతేకు వెళ్లిన గజ్వేల్‌కు చెందిన వ్యక్తికి పాజిటివ్‌ వచ్చిందని, అతడు గత నెల 20 నుంచి ఇంట్లోనే ఉన్నాడని తెలిపారు. అయితే.. 19, 20 తేదీలలో పలు ప్రాంతాలు తిరిగాడని, దీంతో అతడి కుటుంబసభ్యులతో పాటు 12మంది రక్త నమూనాలను పరీక్షలకై సీసీఎంబీకి పంపామని వెల్లడించారు. అతడి ఇంటి చుట్టుపక్కల 499 ఇళ్లలో 1,986మందిని గుర్తించామని, వారికి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు.

Updated Date - 2020-04-03T07:04:00+05:30 IST