ప్రాణం తీసిన కరోనా కట్టడికి కట్టిన తాడు
ABN , First Publish Date - 2020-03-29T02:16:25+05:30 IST
కరోనా కట్టడి కోసం కట్టిన తాడు ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. లాక్డౌన్ నేపథ్యంలో బయటవారెవ్వరినీ రానివ్వకుండా గ్రామానికి వెళ్లే దారికి ..
గుంటూరు: కరోనా కట్టడి కోసం కట్టిన తాడు ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. లాక్డౌన్ నేపథ్యంలో బయటవారెవ్వరినీ రానివ్వకుండా గ్రామానికి వెళ్లే దారికి తాడు కట్టారు. ఈ తాడే ఒకరి ప్రాణం తీసింది. బాపట్ల మండలం పూండ్ల గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా తాడు కట్టారు. బైక్పై వెళ్తు చూసుకోకుండా కూనపురెడ్డి సుబ్బారావు అనే యువకుడు కింద పడ్డారు. తాడు మెడకు చుట్టుకోవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు బాపట్ల మండలం కొండుబొట్ల వారిపాలెం వాసిగా గుర్తించారు.