ఆ కార్మికులకు పూర్తి వేతనాలివ్వాలి: తమ్మినేని
ABN , First Publish Date - 2020-04-03T07:47:49+05:30 IST
కరోనా కట్టడి కోసం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అసంఘటిత కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడి కోసం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అసంఘటిత కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వుల్ని ప్రైవేటు కంపెనీలు తక్షణమే అమలు చేయాలని కోరారు.