24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో 12 మంది మృతి: లవ్ అగర్వాల్
ABN , First Publish Date - 2020-04-04T21:52:51+05:30 IST
24 గంటల్లో దేశవ్యాప్తంగా 12 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దేశంలో మొత్తం 2,992 మందికి కరోనా పాజిటివ్గా తేలిందని తెలిపారు.
ఢిల్లీ: 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దేశంలో మొత్తం 2,992 మందికి కరోనా పాజిటివ్గా తేలిందని తెలిపారు. 24 గంటల్లో 601 పాజిటివ్ కేసులు వచ్చాయని, కరోనా కేసుల్లో 17శాతం మంది 60ఏళ్లు పైబడినవాళ్లే ఉన్నారని పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ కేసుల్లో 9శాతం 20 ఏళ్లలోపువారే ఉన్నారని, కేరళ, ఢిల్లీ, మధ్యప్రదేశ్లో అత్యధిక కేసులు ఉన్నాయని తెలిపారు. కరోనాపై రాష్ట్రాలు పాటించాల్సిన సూచనలను వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. మాస్క్లు, గ్లౌజ్ల వినియోగంపై తగు సూచనలు చేశామని లవ్ అగర్వాల్ చెప్పారు.