కడప రిమ్స్ మెడికల్‌ కాలేజ్‌లో కరోనా కలకలం

ABN , First Publish Date - 2022-01-17T22:52:27+05:30 IST

కడప రిమ్స్ మెడికల్‌ కాలేజ్‌లో కరోనా కలకలం రేగింది. 50 మంది విద్యార్థులకు కరోనా సోకింది. అయితే మంగళవారం వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ పరీక్షలు రాయనున్నారు.

కడప రిమ్స్ మెడికల్‌ కాలేజ్‌లో కరోనా కలకలం

కడప: కడప రిమ్స్ మెడికల్‌ కాలేజ్‌లో కరోనా కలకలం రేగింది. 50 మంది విద్యార్థులకు కరోనా సోకింది. అయితే మంగళవారం వైద్య విద్యార్థులు  ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలోనే 150 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 50 మందికి పాజిటివ్‌ వచ్చింది. రేపటి ఎగ్జామ్స్‌‌ను కడప రిమ్స్‌ మెడికల్‌ కాలేజ్‌ వాయిదావేయాలని భావిస్తోంది. ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో 27 వేలకు కరోనా యాక్టివ్‌ కేసులు చేరాయి. కరోనా బాధితుల్లో 1100 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 60 శాతానికి పైగా ఆక్సిజన్‌పై చికిత్స తీసుకుంటున్నారంటూ సీఎం జగన్ కొవిడ్‌ రివ్యూలో తెలిపారని చెబుతున్నారు. భారీ స్థాయిలో ఆక్సిజన్‌ బెడ్స్‌ వాడకంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - 2022-01-17T22:52:27+05:30 IST