కరోనా కొత్త కేసులు 2094

ABN , First Publish Date - 2021-05-18T06:26:49+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతూనే ఉంది. సోమవారం కూడా 2 వేలకుపైగానే కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా 2094 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

కరోనా కొత్త కేసులు 2094

మరో 10 మంది మృతి


అనంతపురం వైద్యం, మే17: జిల్లాలో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతూనే ఉంది. సోమవారం కూడా 2 వేలకుపైగానే కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా 2094 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ మహమ్మారికి మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 116311కి చేరింది. మరణాలు 793కి పెరిగాయి. 97994 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. ప్రస్తుతం 17524 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అనంత జిల్లా కొత్త కేసుల్లో మూడో స్థానంలో నిలిచింది.


మండలాల వారీగా కేసుల వివరాలు

జిల్లాలో అత్యధికంగా అనంతపురంలోనే 270 కేసులు నమోదయ్యాయి. హిందూపురం 131, ధర్మవరం 128, పుట్టపర్తి 111, కదిరి 81, తాడిపత్రి 68, అమరాపురం, సీకేపల్లి 66, పెనుకొండ 49, గోరంట్ల, ఉరవకొండ 47, బుక్కపట్నం 42, గుంతకల్లు 41, యాడికి 38, కొత్తచెరువు 37, చిలమత్తూరు, రొద్దం 36, గుత్తి 34, నార్పల 30, కనగానపల్లి 29, ఓడీసీ 28, రాప్తాడు 27, మడకశిర, తలుపుల 26, బత్తలపల్లి 25, నల్లమాడ 24, రొళ్ల 23, గుడిబండ, తాడిమర్రి 22, ఆత్మకూరు, కుందిర్పి 21, లేపాక్షి, ముదిగుబ్బ 20, పెద్దవడగూరు, సోమందేపల్లి 19, వజ్రకరూరు, గాండ్లపెంట 18, అగళి 17, కణేకల్లు, కూడేరు, శింగనమల, విడపనకల్లు, యల్లనూరు 15, పరిగి, పామిడి 14, బొమ్మనహాళ్‌, కంబదూరు, నల్లచెరువు 13, బుక్కరాయసముద్రం, రామగిరి 12, అమడగూరు, కళ్యాణదుర్గం, పుట్లూరు, తనకల్లు 11, గార్లదిన్నె, రాయదుర్గం 10, గుమ్మఘట్ట, శెట్టూరు 8, ఎనపికుంట, రాయదుర్గం 7, బ్రహ్మసముద్రం 6, బెలుగుప్ప 5, పెద్దపప్పూరు 4, డీ హీరేహాళ్‌ 2 చొప్పున కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి.



Updated Date - 2021-05-18T06:26:49+05:30 IST