ఢిల్లీకి వెళ్లొచ్చిన వ్యక్తికి కరోనా నెగిటివ్
ABN , First Publish Date - 2020-04-04T09:43:21+05:30 IST
మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామం నుంచి డిల్లీ నిజాముద్దీన్ మర్కజ్కు వెళ్లొచ్చిన వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్
దోమ : మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామం నుంచి డిల్లీ నిజాముద్దీన్ మర్కజ్కు వెళ్లొచ్చిన వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్ తేలింది. నగరంలోని ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి వైద్యులు నిర్ధారణ చేసినట్లు ఎస్ఐ సురేష్, డాక్టర్ మునీబ్లు తెలిపారు. 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారని వివరించారు.