వరంగల్ ఎంజీఎంలో 20 మంది హౌస్ సర్జన్ డాక్టర్లకు కరోనా
ABN , First Publish Date - 2021-04-16T18:09:09+05:30 IST
శవ్యాప్తంగా గడగడలాడిస్తోన్న కరోనా..ఇటు రాష్ట్రంలోనూ పంజా విసురుతోంది. వరంగల్ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గురువారం నాడు ఉమ్మడి వరంగల్ ...
వరంగల్: దేశవ్యాప్తంగా గడగడలాడిస్తోన్న కరోనా..ఇటు రాష్ట్రంలోనూ పంజా విసురుతోంది. వరంగల్ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గురువారం నాడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2వేల కేసులకు పైగా నమోదయ్యాయి. వారంరోజులుగా సగటున రోజుకు 40 కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఎంజీఎం ఆస్పత్రిలో 20 మంది హౌస్ సర్జన్ డాక్టర్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. అయితే ఇందులో నలుగురు ఎంజీఎంలో చికిత్స పొందుతున్న హౌస్ సర్జన్లు అని అధికారులు తెలిపారు.