తిరుమల వేద పాఠశాలలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-03-10T23:26:41+05:30 IST

ధర్మగిరి వేద పాఠశాలలో మరోసారి కరోనా విజృంభించింది.

తిరుమల వేద పాఠశాలలో కరోనా కలకలం

తిరుమల: ధర్మగిరి వేద పాఠశాలలో మరోసారి కరోనా విజృంభించింది. వేద పాఠశాలలోని 57మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. గత నెలలోనే వేద పాఠశాల ప్రారంభమైంది. పాఠశాలలోని  450 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షల్లో ఏకంగా 57 మందికి కరోనా సోకినట్లు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో విద్యార్థులను చికిత్స కోసం తిరుపతిలోని స్విమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.


ముందస్తు జాగ్రత్తగా పాజిటివ్ తేలిన విద్యార్థులకు దగ్గరగా ఉన్నవారిని క్వారంటైన్‌లో ఉంచారు. విద్యార్థులకు కరోనా ఉందని తేలడంతో టీటీడీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని టీటీడీ పేర్కొంది. 

Updated Date - 2021-03-10T23:26:41+05:30 IST