స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై విచారణ కమిటీ ఏర్పాటు
ABN , First Publish Date - 2020-08-10T02:06:57+05:30 IST
స్వర్ణ ప్యాలెస్లో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణకు జేసీ(అభివృద్ధి) ఎల్.శివశంకర్ నేతృత్వంలో కమిటీని నియమించారు.
విజయవాడ: స్వర్ణ ప్యాలెస్లో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణకు జేసీ(అభివృద్ధి) ఎల్.శివశంకర్ నేతృత్వంలో కమిటీని నియమించారు. కమిటీలో సబ్ కలెక్టర్ ధ్యానచంద్ర, వీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ జి.గీతాబాయి, ఆర్ఎఫ్వో ఉదయ్కుమార్, విద్యుత్ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ప్రమాద కారణాలు, భద్రతా నిబంధనలపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆస్పత్రుల నిర్వహణ లోపాలు, అధిక ఫీజుల వసూలపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని పాలనాధికారి కమిటీని ఆదేశించారు.