మెదక్ జిల్లాలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2021-12-05T01:14:03+05:30 IST
జిల్లాలోని పలు పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టించింది. హవేలి
మెదక్: జిల్లాలోని పలు పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టించింది. హవేలి ఘనపూర్ గురుకుల బాలికల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. తూప్రాన్లోని హైదర్గూడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు, ఆమె ఇద్దరు పిల్లలకు కరోనా వచ్చింది. కరోనా వ్యాప్తి చెందుతుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.