భారత్‌లో ఆగని కరోనా ఉధృతి

ABN , First Publish Date - 2020-09-21T15:57:01+05:30 IST

భారత దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.

భారత్‌లో ఆగని కరోనా ఉధృతి

న్యూఢిల్లీ: భారత దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 86,961 కరోనా కేసులు నమోదు కాగా.. 1,130 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 54,87,581కు కరోనా కేసులు నమోదయ్యాయి. 87,892 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 10,03,299 యాక్టివ్ కేసులు ఉండగా.. చికిత్స నుంచి కోలుకుని 43,96,399 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 79.28 శాతం ఉందని, మరణాల రేటు 1.61 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Updated Date - 2020-09-21T15:57:01+05:30 IST