భయం భయం
ABN , First Publish Date - 2020-07-09T10:25:41+05:30 IST
గ్రేటర్లో కరోనా కోరలు చాస్తోంది. బుధవారం జీహెచ్ఎంసీ పరిధిలో 1,590 మందికి కరోనా పాజిటివ్గా ..
1590 మందికి కరోనా
హైదరాబాద్ సిటీ, జూలై 8 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్లో కరోనా కోరలు చాస్తోంది. బుధవారం జీహెచ్ఎంసీ పరిధిలో 1,590 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. గడిచిన ఎనిమిది రోజుల్లో పాజిటివ్ల సంఖ్య 10,817గా నమోదు అయింది. జూలై మొదటి నుంచి కరోనా కేసుల సంఖ్య గ్రేటర్వాసులను భయపెడుతోంది. ఈ నెల మూడో తేదీన రికార్డు స్థాయిలో 1,658 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత నుంచి కొంత తగ్గుముఖం పట్టాయి. అయినా, రోజుకు పదిహేను వందలకు సమీపంలో కేసులు ఉంటున్నాయి. కరోనా నిర్ధారణ కోసం జనం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద, ప్రైవేటు ఆస్పత్రుల వద్ద క్యూ కడుతున్నారు.