ఏపీలో కరోనాతో ఆరుగురు మృతి
ABN , First Publish Date - 2021-11-29T00:56:36+05:30 IST
గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 178 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 20,72,624
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 178 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 20,72,624 మందికి కరోనా సోకింది. 24 గంటల్లో కరోనాతో ఆరుగురు మృతి చెందారు. ఏపీలో మొత్తం కరోనాతో 14,438 మంది మృతి చెందారు. ప్రస్తుతం 2,140 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 20,56,046 మంది బాధితులు కోలుకున్నారు.
మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కర్నాటకలో మళ్లీ ఆంక్షలు విధించారు. బెంగళూరు, మైసూర్, ధార్వాడడ్లో కఠిన నిబంధలు పెట్టారు. సంప్రదాయ వేడుకలు, సమావేశాలు నిర్వహించవద్దని ప్రభుత్వం ఆదేశించింది. 2 నెలలపాటు అన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని అధికారులు ఆదేశించారు.