కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-07-03T11:28:24+05:30 IST
కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హిమాచల్ప్రదేశ్ గవరర్ బండారు దత్తాత్రేయ కోరారు. గురువారం జనగామకు చెందిన
హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ
మాల మహాసభ నేతకు గవర్నర్ ఫోన్
జనగామ ఆంధ్రజ్యోతి, జూలై 2 : కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హిమాచల్ప్రదేశ్ గవరర్ బండారు దత్తాత్రేయ కోరారు. గురువారం జనగామకు చెందిన మాలమహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాటి కుమార్కు గవర్నర్ నుంచి ఫోన్ వచ్చింది. ఈ మేరకు గవర్నర్ కుమార్తో మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల తమవంతుగా ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు. హైదరాబాద్లో కరోనా తీవ్రత అధికంగా ఉన్న ట్లు వార్తలు వస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని గవర్నర్ సూచించారు. కాగా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉండి సొంత రాష్ట్ర ప్రజల యోగక్షేమాలపై అప్రమత్తం చేయడం పట్ల కుమార్ గవర్నర్కు కృతజ్ఞతలు తెలిపారు.