కరోనా భయంతో ఉరి

ABN , First Publish Date - 2021-05-11T09:22:16+05:30 IST

రోనా సోకిందనే అనుమానంతో నెల్లూరు జిల్లాలో ఓ యువకుడు భయపడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు

కరోనా భయంతో ఉరి

ఉదయగిరి రూరల్‌, మే 10: కరోనా సోకిందనే అనుమానంతో నెల్లూరు జిల్లాలో ఓ యువకుడు భయపడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయగిరి మండలం నేలటూరుకు చెందిన పెండ్యాల కొండలరావు (36) గుంటూరులో ప్రింటర్స్‌ వర్క్‌ చేస్తూ జీవిస్తున్నారు. కర్ఫ్యూ కారణంగా పని లేకపోవడంతో వారం రోజుల క్రితం భార్య, కుమార్తెను అత్తగారి ఊరైన విజయనగరం జిల్లా సాలూరుకు పంపించారు. కొండలరావు స్వగ్రామం వచ్చారు. నీరసం, ఒళ్లు నొప్పులతో ఉదయగిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. గ్రామానికి చెందిన పలువురు వలస కార్మికులు కరోనాతో మృతిచెందినట్లు గ్రామస్థులు చర్చించుకోవడం విన్న కొండలరావు భయపడ్డారు. సోమవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి తన తోటలో వేపచెట్టుకు తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొండలరావు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. 

Updated Date - 2021-05-11T09:22:16+05:30 IST