కరోనాలో సమర్థవంతంగా విధులు

ABN , First Publish Date - 2020-05-25T10:14:05+05:30 IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా నియోజకవర్గంలోని గ్రామ సచివాలయ, వలంటీర్లు విధులను

కరోనాలో సమర్థవంతంగా విధులు

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి


వెంకటాచలం, మే 24 : కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా నియోజకవర్గంలోని గ్రామ సచివాలయ, వలంటీర్లు విధులను సమర్థవంతంగా నిర్వహించారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని చెముడుగుంట గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే  శంకుస్థాపన చేశారు.  ప్రజలందరికీ  పంపిణీ చేసేందుకు గ్రామ కార్యదర్శికి మాస్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌తో గ్రామాల్లో ఆగిన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించడం వల్ల నియోజకవర్గంలో కరోనా పాజిటివ్‌ కేసులు చాలా వరకు నమోదు కాలేదన్నారు. 

Updated Date - 2020-05-25T10:14:05+05:30 IST