భారత అండర్‌-19 జట్టులో ఆరుగురికి కరోనా

ABN , First Publish Date - 2022-01-20T06:43:46+05:30 IST

అండర్‌-19 వరల్డ్‌క్‌పలో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత యువ జట్టుపై కరోనా మహమ్మారి పంజా విసిరింది.

భారత అండర్‌-19 జట్టులో ఆరుగురికి కరోనా

టరౌబ (ట్రినిడాడ్‌): అండర్‌-19 వరల్డ్‌క్‌పలో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత యువ జట్టుపై కరోనా మహమ్మారి పంజా విసిరింది. లీగ్‌ దశలో భాగంగా బుధవారం గ్రూప్‌-బిలోని ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు ప్రారంభానికి ముందు కెప్టెన్‌ యష్‌ ధుల్‌, తెలుగు ఆటగాడు-వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌తో పాటు మొత్తం ఆరుగురు క్రికెటర్లకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రధాన ఆటగాళ్లు లేకుండానే మిగిలిన 11 మందితో నిషాంత్‌ సింధు సారథ్యంలో భారత్‌ బరిలోకి దిగింది. కొవిడ్‌ బారినపడిన క్రికెటర్లందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. త్వరలోనే వారు కోలుకుంటారని బీసీసీఐ అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఉగాండాతో జరగనున్న మ్యాచ్‌లో కూడా ఇదే టీమ్‌తో ఆడనున్నట్టు ఆ అధికారి తెలిపారు.

Updated Date - 2022-01-20T06:43:46+05:30 IST