హైదరాబాద్: మూడేళ్ల బాలుడికి కరోనా

ABN , First Publish Date - 2020-03-26T17:21:30+05:30 IST

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41కి చేరింది.

హైదరాబాద్: మూడేళ్ల బాలుడికి కరోనా

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41కి చేరింది. ఇందులో మూడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. గోల్కొండ ప్రాంతానికి చెందిన ఆ బాలుడికి సౌదీ ట్రావెల్ హిస్టరీ ఉంది. ఆ బాలుడి తల్లిదండ్రులకు కూడా గురువారం పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ప్రైమరీ కాంట్రాక్ట్ ద్వారా ఓ మహిళకు కరోనా సోకింది. లండన్ నుంచి వచ్చిన రంగారెడ్డి జిల్లా, కోకాపేటకు చెందిన వ్యక్తికి పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. అతని భార్యకు కరోనా సోకింది. అలాగే మణికొండ, కోకాపేట పరిధిలోనే ప్రైమరీ కాంట్రక్ట్ ద్వారా ఇద్దరు కుటుంబసభ్యులకు కరోనా సోకింది. దీంతో ప్రైమరీ కాంట్రాక్ట్ ద్వారా కరోనా వచ్చినవారి సంఖ్య ఆరుకు చేరింది. మొత్తంగా తెలంగాణలో కేసుల సంఖ్య 41కి చేరింది. వరుసగా 12వ రోజు కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-03-26T17:21:30+05:30 IST