74మందికి కరోనా
ABN , First Publish Date - 2021-04-14T05:07:59+05:30 IST
74మందికి కరోనా
ఇబ్రహీంపట్నం/ఆమనగల్లు: ఇబ్రహీంపట్నం డివిజన్లో మంగళవారం 12కేంద్రాలు, రెండు మొబైల్ టీంల ద్వారా 506 మందికి కరోనా యాంటిజెన్ టెస్టు లు నిర్వహించగా 74మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. ఆమనగల్లులోని ఆసుపత్రిలో 47మందికి కరోనా టెస్ట్లు నిర్వహించగా 12మందికి పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు తెలిపారు.
- చేవెళ్ల డివిజన్లో 34మందికి పాజిటివ్
చేవెళ్ల: చేవెళ్ల డివిజన్లో మంగళవారం మొత్తం 256మందికి కరోన పరీక్షలు చేయగా 34మందికి పాజిటివ్ వచ్చి ందని వైద్యులు పేర్కొన్నారు. కాగా కాం గ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం సీనియర్ నాయకులు, ఎంపీటీసీ ఎస్.వసం తం తదితరులు చేవెళ్ల మండల పరిఽధిలో ని ఆలూర్ పీహెచ్సీలో కరోనా టీకాను వేయించుకున్నారు.
- షాద్నగర్ డివిజన్లో 64 మందికి పాజిటివ్
షాద్నగర్ అర్బన్: షాద్నగర్ డివిజన్లో మొత్తం 340 మందికి పరీక్షలు చేయగా 64మందికి పాజిటివ్ వచ్చినట్లు హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్ తెలిపారు.