329 మందికి కరోనా.. నలుగురి మృతి
ABN , First Publish Date - 2021-07-25T06:26:17+05:30 IST
జిల్లాలో 24 గంటల్లో 329 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, కొవిడ్తో అత్యధికంగా నలుగురు మృతి చెందారు.
తిరుపతి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 24 గంటల్లో 329 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, కొవిడ్తో అత్యధికంగా నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ల సంఖ్య 228834కు, కొవిడ్ మరణాలు 1706కు చేరాయి. యాక్టివ్ కేసులు 2952 ఉన్నట్లు ప్రభుత్వ బులెటిన్ వెల్లడించింది. కొత్తగా గుర్తించిన కరోనా కేసుల్లో.. తిరుపతిలో 43, రేణిగుంటలో 23, తిరుపతి రూరల్, పుత్తూరు మండలాల్లో 17 చొప్పున, శ్రీకాళహస్తిలో 15, చిత్తూరులో 13, పీలేరు, పెనుమూరు మండలాల్లో 12 చొప్పున, వి.కోటలో 11, మదనపల్లె, సోమల, వెదురుకుప్పం మండలాల్లో 8 వంతున, జీడీనెల్లూరు, పూతలపట్టు, బంగారుపాలెం మండలాల్లో 7 చొప్పున, ములకలచెరువు, ఐరాల, చంద్రగిరి, పులిచెర్ల మండలాల్లో 6 వంతున, నగరి, తొట్టంబేడు, తవణంపల్లె, పాకాల, ఏర్పేడు, యాదమరి మండలాల్లో 5 చొప్పున, పలమనేరు, ఎర్రావారిపాలెం మండలాల్లో 4 వంతున, కేవీబీపురం, కార్వేటినగరం, రామకుప్పం, కేవీపల్లె, కుప్పం, తంబళ్ళపల్లె, సదుం, గుర్రంకొండ, రొంపిచెర్ల మండలాల్లో 3 వంతున, గంగవరం, కలకడ, బీఎన్ కండ్రిగ, శ్రీరంగరాజపురం, పిచ్చాటూరు, వరదయ్యపాళెం, కురబలకోట, బి.కొత్తకోట, రామచంద్రాపురం, నారాయణవనం, నాగలాపురం, నిమ్మనపల్లె మండలాల్లో రెండేసి చొప్పున, కలికిరి, నిండ్ర, చౌడేపల్లె, పెద్దపంజాణి, గుడుపల్లె, గుడిపాల, విజయపురం, పెద్దమండ్యం మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.