కొత్తగా 25 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-12-04T07:52:33+05:30 IST
జిల్లాలో గురు, శుక్రవారాల నడుమ 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 25 మందికి వైరస్ నిర్ధారణ అయింది.
తిరుపతి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురు, శుక్రవారాల నడుమ 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 25 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ఈ వ్యవధిలో వైరస్ కారణంగా మరణాలేవీ సంభవించలేదు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 248101కు చేరగా, కొవిడ్ మరణాలు 1955గా ఉన్నాయి. శుక్రవారం ఉదయానికి 278 యాక్టివ్ పాజిటివ్ కేసులున్నాయి. తాజా కేసులు.. తిరుపతి నగరంలో 7, చిత్తూరులో 5, మదనపల్లె, కలకడ మండలాల్లో 2 చొప్పున శ్రీకాళహస్తి, నగరి, పాకాల, పీలేరు, చంద్రగిరి, కలికిరి, గుడిపాల, కురబలకోట, ఐరాల మండలాల్లో ఒక్కొక్కటి నమోదయ్యాయి.