23 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-07-25T04:12:45+05:30 IST

ఉమ్మడి మహబూ బ్‌నగర్‌ జిల్లాలో శనివారం 9,856 కరోనా పరీక్షలు నిర్వహిం చగా 23 మందికి నిర్ధారణ అయ్యింది.

23 మందికి కరోనా

మహబూ బ్‌నగర్‌, జూలై 24 : ఉమ్మడి మహబూ బ్‌నగర్‌ జిల్లాలో శనివారం 9,856 కరోనా పరీక్షలు నిర్వహిం చగా 23 మందికి నిర్ధారణ అయ్యింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2,304 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి కరోనా సోకింది. నారాయణపేట జిల్లాలో 411 పరీక్షలకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వనపర్తి జిల్లాలో 2,794 పరీక్షలకు 12 కేసులు, నాగర్‌కర్నూలు జిల్లాలో 3,559 పరీక్షలకు రెండు కేసులు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 788 పరీక్షలకు ఐదు కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2021-07-25T04:12:45+05:30 IST