139 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-10-29T06:27:23+05:30 IST

కరోనా కేసులు ఒక రోజు పెరుగుతూ, మరో రోజు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 139 కేసులు నమోదయ్యాయి

139 మందికి కరోనా

గద్వాలలో ఒకరు, మహబూబ్‌నగర్‌లో ఒకరు మృతి


మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం)/గద్వాల క్రైం/నారాయణపేట క్రైం/నాగర్‌కర్నూల్‌ క్రైం/వనపర్తి, అక్టోబరు 28 : కరోనా కేసులు ఒక రోజు పెరుగుతూ, మరో రోజు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 139 కేసులు నమోదయ్యాయి. అలాగే జోగుళాంబ గద్వాల జిల్లాలో ఒకరు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒకరు మృతి చెదారు.


మమబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం 38 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ అయ్యింది. అందులో జిల్లాలోని వివిధ మండలాల్లో 19 మంది, జిల్లా కేంద్రంలో మరో 19 మంది వైరస్‌ బారిన పడ్డారు. అదే విధంగా మూసాపేట మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు కరోనాతో మృతి చెందింది.


జోగుళాంబ గద్వాల జిల్లాలో 17 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో జిల్లా కేంద్రంలోనే అత్యధికంగా ఐదు మందికి కరోనా సోకగా, మిగిలిన 12 కేసులు ఇతర మండలాల్లో వచ్చాయి. కాగా, జిల్లా కేంద్రంలోని కొవిడ్‌-19 ల్యాబ్‌లో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు.


నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మొత్తం 52 కరోనా కేసులు రాగా, అత్యధికంగా అచ్చంపేట మండలంలో 14 మందికి వైరస్‌ సోకింది. మిగిలిన 38 కేసులు వివిధ మండలాల్లో నమోదయ్యాయి.


వనపర్తి జిల్లాలో మొత్తం 30 కేసులు నమోదు కాగా, అత్యధికంగా వనపర్తి మండలంలో 15 కేసులు నమోదయ్యాయి. మిగిలిన 15 కేసులు వివిధ మండలాల్లో వచ్చాయి.


నారాయణపేట జిల్లాలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. మాగనూరు, మరికల్‌లో ఒక్కొక్కరు చొప్పున వైరస్‌ బారిన పడ్డారు.

Updated Date - 2020-10-29T06:27:23+05:30 IST