1042 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-06-11T07:56:48+05:30 IST

జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 204555కి చేరుకుంది.

1042 మందికి కరోనా

11మంది మృతి


తిరుపతి, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధ, గురువారాల నడుమ 24 గంటల వ్యవధిలో 1042 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అదే సమయంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 11మంది కొవిడ్‌ బారిన పడి మరణించారు. తాజా కేసులతో జిల్లాలో ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 204555కి చేరుకోగా మరణాల సంఖ్య 1423కు చేరుకుంది.మరోవైపు గురువారం ఉదయానికి జిల్లాలో 13466 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నట్టు ప్రభుత్వ బులెటిన్‌ వెల్లడించింది. కాగా కొత్తగా గుర్తించిన పాజిటివ్‌ కేసుల్లో చిత్తూరులో 101, తిరుపతి నగరంలో 86, పీలేరులో 52, తిరుపతి రూరల్‌లో 46, మదనపల్లెలో 41, కుప్పం, రామకుప్పం మండలాల్లో 29చొప్పున,తవణంపల్లెలో 28, పలమనేరులో 26,నగరి, గుడిపాల మండలాల్లో 24 వంతున, బి.కొత్తకోటలో 22, బైరెడ్డిపల్లె, జీడీనెల్లూరు, కురబలకోట, రేణిగుంట మండలాల్లో 21 వంతున, ములకలచెరువులో 20, పుత్తూరు, కేవీపల్లె, పాకాల మండలాల్లో 19 వంతున, శ్రీకాళహస్తిలో 18, పుంగనూరు, వాల్మీకిపురం, ఏర్పేడు మండలాల్లో 17చొప్పున, రామచంద్రాపురంలో 16, గంగవరం, పాలసముద్రం, వెదురుకుప్పం మండలాల్లో 15 వంతున, పీటీఎం, శ్రీరంగరాజపురం, వి.కోట మండలాల్లో 14 చొప్పున,  పులిచెర్లలో 12, కలికిరి, పెనుమూరు, వడమాలపేట మండలాల్లో 11 చొప్పున, కలకడ, రొంపిచెర్ల, సత్యవేడు మండలాల్లో 10 చొప్పున, తొట్టంబేడులో 9, గుర్రంకొండ, పూతలపట్టు మండలాల్లో 8వంతున, కార్వేటినగరం, నారాయణవనం, పెద్దపంజాణి, యాదమరి మండలాల్లో 7 చొప్పున, బంగారుపాళ్యం, చంద్రగిరి, పెద్దమండ్యం, సోమల మండలాల్లో 6 వంతున, కేవీబీపురం, పిచ్చాటూరు మండలాల్లో 5 చొప్పున, గుడుపల్లె, తంబళ్ళపల్లె, వరదయ్యపాళ్యం మండలాల్లో 4 వంతున, చిన్నగొట్టిగల్లు, నాగలాపురం, నిండ్ర, సదుం, విజయపురం, ఎర్రావారిపాళ్యం మండలాల్లో 3 చొప్పున, చౌడేపల్లె, ఐరాల, శాంతిపురం మండలాల్లో 2 వంతున, బీఎన్‌ కండ్రిగ, నిమ్మనపల్లె, రామసముద్రం మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.

Updated Date - 2021-06-11T07:56:48+05:30 IST