ఒకే జట్టులోని 10 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-08-11T09:20:10+05:30 IST
బ్రెజిల్లోని ఓ దేశవాళీ ఫుట్బాల్ జట్టులో ఏకంగా 10మంది ఆటగాళ్లు కరోనా వైరస్ బారినపడ్డారు
సావోపోలో: బ్రెజిల్లోని ఓ దేశవాళీ ఫుట్బాల్ జట్టులో ఏకంగా 10మంది ఆటగాళ్లు కరోనా వైరస్ బారినపడ్డారు. దాంతో ఆ జట్టు ఆడాల్సిన మ్యాచ్ను చివరి నిమిషంలో వాయిదా వేశారు. బ్రెజిల్కు చెందిన గియాస్ జట్టులోని 23 మందిలో 10 మంది కరోనా పాజిటివ్గా తేలారు. ఫలితంగా సావోపోలో ఎఫ్సీతో జరగాల్సిన దేశవాళీ మ్యాచ్ను వాయుదా వేశారు.