కరోనాపై పోరులో మేము సైతం: ఎంటీఎఫ్‌

ABN , First Publish Date - 2020-03-31T09:22:20+05:30 IST

కరోనా మహమ్మారిపై పోరులో భాగస్వాములయ్యేందుకు తామూ సిద్ధంగా ఉన్నామని మున్సిపల్‌ పాఠశాలల ఉపాధ్యాయులు తెలిపారు. తమతోపాటు అర్బన్‌ మండల విద్యాశాఖాధికారి పరిధిలో పని చేస్తున్న జెడ్పీ, ఎయిడెడ్‌ పాఠశాలల ఉపాధ్యాయుల

కరోనాపై పోరులో మేము సైతం: ఎంటీఎఫ్‌

కరోనా మహమ్మారిపై పోరులో భాగస్వాములయ్యేందుకు తామూ సిద్ధంగా ఉన్నామని మున్సిపల్‌ పాఠశాలల ఉపాధ్యాయులు తెలిపారు. తమతోపాటు అర్బన్‌ మండల విద్యాశాఖాధికారి పరిధిలో పని చేస్తున్న జెడ్పీ, ఎయిడెడ్‌ పాఠశాలల ఉపాధ్యాయుల సేవలను కూడా వినియోగించుకోవచ్చని ప్రభుత్వానికి సూచించారు ఈ అంశాలన్నింటినీ సోమవారం పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ జేఎస్సార్కేఆర్‌ విజయ్‌కుమార్‌ల దృష్టికి తీసుకెళ్లినట్లు మున్సిపల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.రామకృష్ణ తెలిపారు.

Updated Date - 2020-03-31T09:22:20+05:30 IST