కరోనాపై పోరులో మేము సైతం: ఎంటీఎఫ్
ABN , First Publish Date - 2020-03-31T09:22:20+05:30 IST
కరోనా మహమ్మారిపై పోరులో భాగస్వాములయ్యేందుకు తామూ సిద్ధంగా ఉన్నామని మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు తెలిపారు. తమతోపాటు అర్బన్ మండల విద్యాశాఖాధికారి పరిధిలో పని చేస్తున్న జెడ్పీ, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయుల
కరోనా మహమ్మారిపై పోరులో భాగస్వాములయ్యేందుకు తామూ సిద్ధంగా ఉన్నామని మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు తెలిపారు. తమతోపాటు అర్బన్ మండల విద్యాశాఖాధికారి పరిధిలో పని చేస్తున్న జెడ్పీ, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయుల సేవలను కూడా వినియోగించుకోవచ్చని ప్రభుత్వానికి సూచించారు ఈ అంశాలన్నింటినీ సోమవారం పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, కమిషనర్ అండ్ డైరెక్టర్ జేఎస్సార్కేఆర్ విజయ్కుమార్ల దృష్టికి తీసుకెళ్లినట్లు మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రామకృష్ణ తెలిపారు.