21కు చేరిన కరోనా కేసులు.. కంకిపాడులో కలకలం
ABN , First Publish Date - 2020-03-30T04:36:25+05:30 IST
పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో కరోనా కలకలం రేగింది. 10 రోజుల క్రితం మాల్దీవ్స్ నుంచి వచ్చిన కంకిపాటి మురళికి కరోనా లక్షణాలు..
కృష్ణా: పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో కరోనా కలకలం రేగింది. 10 రోజుల క్రితం మాల్దీవ్స్ నుంచి వచ్చిన కంకిపాటి మురళికి కరోనా లక్షణాలు కనిపించాయిజ. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న మురళిని అధికారులు క్వారంటైన్కు తరలించారు.
కాగా ఇప్పటి వరకూ ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 21కి చేరినట్లు వైద్యులు తెలిపారు. ఆదివారం కొత్తగా మరో రెండు పాజిటివ్ కేసులను గుర్తించినట్లు చెప్పారు. విశాఖ, అరకులో ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.
మరోవైపు ప్రకాశం జిల్లాలో కరోనా బారిన బాధితులతో అధికారులు కాంటాక్ట్ అయ్యారు. మొత్తం 68 మందిని రక్త పరీక్షల నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్కి తరలించినట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. వీరందరిని ఐసోలేషన్ వార్డులో ఉంచినట్లు చెప్పారు.