కరోనా సోకిందనే అనుమానంతో.. కుటుంబసభ్యులకు ఇబ్బంది కలగకూడదని..
ABN , First Publish Date - 2020-08-09T15:59:00+05:30 IST
ఒంగోలు మండలం వలేటి వారిపాలెం గ్రామంలో..
ఒంగోలు(ఆంధ్రజ్యోతి): ఒంగోలు మండలం వలేటి వారిపాలెం గ్రామంలో కరోన వైరస్ సోకిందనే భయంతో ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కొంత కాలంగా కిడ్నీలు దెబ్బతిని పోవటంతో ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఇటీవల కరోనా సోకిందనే అనుమానంతో కుటుంబసభ్యులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని బంధువులు చెబుతున్నారు. శనివారం ఉదయం చెరువులో మృతదేహం ఉండటాన్ని గుర్తించిన గ్రామస్థులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఒంగోలు నుంచి వచ్చిన రిస్క్యూటీం మృతదేహాన్ని బయటకు తీశారు. రూరల్ సీఐ లక్ష్మణ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.