శ్రీరామనవమి వేడుకలపై కరోనా ప్రభావం
ABN , First Publish Date - 2021-04-21T14:09:39+05:30 IST
విజయనగరం: శ్రీరామనవమి వేడుకలపై కరోనా ప్రభావం పడింది. ప్రముఖ పుణ్య క్షేత్రమైన రామతీర్ధంలో భక్తులకు దూరంగా శ్రీరామ నవమి వేడుకలు జరగనున్నాయి.
విజయనగరం: శ్రీరామనవమి వేడుకలపై కరోనా ప్రభావం పడింది. ప్రముఖ పుణ్య క్షేత్రమైన రామతీర్ధంలో భక్తులకు దూరంగా శ్రీరామ నవమి వేడుకలు జరగనున్నాయి. ఆరుబయలు ప్రదేశంలో జరగవలసిన స్వామివారి కల్యాణాన్ని కరోనా మహమ్మారి కారణంగా అర్చకులు ఆలయంలోనే జరిపించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖులైనా వస్తారన్న సమాచారం లేదని దేవస్ధానం అధికారులు చెబుతున్నారు.