రిజిస్ట్రేషన్లపై కరోనా ఎఫెక్ట్
ABN , First Publish Date - 2021-05-08T05:10:34+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ రిజిస్ట్రేషన్శాఖపై పడింది. గత ఏడాది కొత్తగా ధరణి ద్వారా రిజి స్ట్రేషన్ల విధానం తీసుకురాగా దాదాపు మూడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ర్ట్ఱేషన్లు నిలిచిపోయాయి.
రోజుకు 50 డాక్యుమెంట్లకే అనుమతి
ఉమ్మడి జిల్లాలో ఏప్రిల్లో రూ. 14.14 కోట్ల ఆదాయం
కరీంనగర్ క్రైం, మే 2: కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ రిజిస్ట్రేషన్శాఖపై పడింది. గత ఏడాది కొత్తగా ధరణి ద్వారా రిజి స్ట్రేషన్ల విధానం తీసుకురాగా దాదాపు మూడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ర్ట్ఱేషన్లు నిలిచిపోయాయి. దీంతో స్టాంపులు, రిజిస్ట్రేన్ల శాఖ పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోయింది. ప్రస్తుతం ఆ శాఖకు చెందిన పలువురు ఉద్యోగులు, డాక్యుమెంట్ రైటర్లు, ఇతర సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో కరీంనగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జాగ్రత్త చర్య లు చేపట్టారు. కరోనా ఉధృతంగా ఉండడం, ప్రభుత్వం లాక్డౌన్ ఉండబోదని తేల్చి చెప్పటంతో ప్రభుత్వ కార్యాలయాల్లో జాగ్ర త్త చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఇందులో భాగంగా కరీంనగర్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రద్దీ తగ్గించేందుకు రోజుకు 50 డాక్యు మెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వారం రోజుల నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. కరీంనగర్ సబ్రిజిస్ట్రార్ కార్యాల యంలో రోజుకు 100కుపైగా ఆస్తుల రిజిస్ట్రేషన్లు అయ్యేవి. ఇప్పుడు 50కి కుదించారు. ఇంకో వైపు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే క్రయ విక్రయదారుల సంఖ్య కరోనా కారణంగా ఇటీవల తగ్గిపోయింది. అత్యవసరం ఉన్న బ్యాంక్ రుణాలు, మార్ట్గేజ్, సంస్థలు, రిలీజ్ డాక్యుమెంట్, జీపీఏల వంటి డాక్యు మెంట్ల రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతున్నాయి.
డాక్యుమెంట్ రైటర్ల సెల్ఫ్ లాక్డౌన్
కరీంనగర్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో ఉన్న డాక్యుమెంట్ రైటర్లు శనివారం నుంచి సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించారు. ఈ నెల 23వ తేదీ వరకు 15 రోజుల పాటు ఎలాంటి డాక్యు మెంట్లు తయారు చేయవద్దని డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ మేరకు కరీంనగర్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులకు కూడా సమాచారాన్ని అందించింది. శనివారం నుంచి కరీంనగర్లోని డాక్యుమెంట్ రైటర్లు వారి కార్యాలయాలను మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరు కూడా డాక్యుమెంట్ లను తయారు చేయవద్దని, అత్యవసరమున్న సందర్భంలో క్రయవిక్రయదారులే డాక్యు మెంట్లను తయారు చేసుకుంటారని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఏప్రిల్లో కార్యాలయాల వారీగా ఆదాయం
ఉమ్మడి జిల్లాలో 13 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏప్రిల్లో 7,096 ఆస్తుల రిజిస్ట్రేష న్లు జరిగాయి. ఈ రిజిస్ట్రేషన్ల ద్వారా 14 కోట్ల 14 లక్ష 44 వేల రూపాయలు ఆదాయం సమకూరింది. ఇందులో స్టాంపుడ్యూటీ రూపంలో 9.71 కోట్లు, ట్రాన్స్ఫర్ డ్యూటీ 2.94 కోట్లు, రిజిస్ట్రేషన్ ఫీజు 1.50 కోట్ల ఆదాయం వచ్చింది.
కార్యాలయం రిజిస్ట్రేషన్ల సంఖ్య ఆదాయం (రూ. కోట్లలో)
-----------------------------------------------------------
కరీంనగర్ 1187 3,47,72,000
కరీంనగర్ రూరల్ 523 76,18,000
గంగాధర 769 1,41,95,000
హుజురాబాద్ 453 98,05,000
జగిత్యాల 586 1,26,05,000
మల్యాల 125 31,52,000
మంథని 212 21,60,000
మెట్పల్లి 201 30,51,000
పెద్దపల్లి 1140 2,98,91,000
సిరిసిల్ల 865 90,38,000
సుల్తానాబాద్ 134 33,44,000
వేములవాడ 521 61,17,000
కోరుట్ల 380 56,96,000
మొత్తం 7096 14,14,44,000