పోలవరంపై కరోనా ఎఫెక్ట్
ABN , First Publish Date - 2021-05-09T09:00:04+05:30 IST
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కరోనాఎఫెక్ట్ పడింది. సుమారు 10 మంది అధికారులకు పాజిటివ్ వచ్చింది. దీంతో వారు సెలవులో ఉన్నారు
10 మంది అధికారులకు పాజిటివ్
రాజమహేంద్రవరం, మే 8 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కరోనాఎఫెక్ట్ పడింది. సుమారు 10 మంది అధికారులకు పాజిటివ్ వచ్చింది. దీంతో వారు సెలవులో ఉన్నారు. కార్మికులు చాలామంది కరోనా భయంతో సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రస్తుతం స్పిల్ వే పనులు, ఎగువ కాఫర్ డ్యామ్ పనులు పూర్తి చేయడంపైనే అధికారులు దృష్టి పెట్టారు. ఎగువ కాఫర్ డ్యామ్ గ్యాప్ను పూరించే పని మొదలెట్టారు. ఈ నెల 25వ తేదీకి ఒక లెవల్కు తీసుకురావాలని గతంలో నిర్ణయించగా.. కరోనా విజృంభణ వల్ల పనులకు ఆటంకం కలుగుతోంది. కాగా ప్రాజెక్టు పనులు ఆగిపోలేదని, కార్మికులతో ఇబ్బందులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.