లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే జైలే!

ABN , First Publish Date - 2020-03-27T06:11:37+05:30 IST

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపైకి వస్తే ఇక జైలుకే! కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు కఠిన నిబంధనలు జారీ చేసింది..

లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే జైలే!

కేంద్ర హోం శాఖ కఠిన నిబంధనలు

న్యూఢిల్లీ, మార్చి 26: లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపైకి వస్తే ఇక జైలుకే! కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు కఠిన నిబంధనలు జారీ చేసింది. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు మరో 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వానికి సహకరించకుండా రోడ్డుపైకి వచ్చే వారికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అయితే, లాక్‌డౌన్‌ నుంచి ఆస్పత్రులు, రేషన్‌ షాపులు, పాల డెయిరీలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కార్యాలయాలు, ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది.

Updated Date - 2020-03-27T06:11:37+05:30 IST