3 ప్లై ఫేస్మాస్కు రూ.16: కేంద్రం
ABN , First Publish Date - 2020-03-27T06:29:28+05:30 IST
కరోనా నేపథ్యంలో ఫేస్మాస్కులకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని వాటి ధరలు పెరగకుండా కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో ..
న్యూఢిల్లీ, మార్చి 26: కరోనా నేపథ్యంలో ఫేస్మాస్కులకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని వాటి ధరలు పెరగకుండా కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో 3 ప్లై మెల్ట్బ్లోన్ ఫేస్మాస్కు ధరను 16 రూపాయలుగా నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి పవన్ అగర్వాల్ గురువారం ప్రకటించారు. డిమాండుకు అనుగుణంగా ఫేస్మాస్కులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచడమే ప్రస్తుతం తమ ముందున్న అతిపెద్ద సవాలని చెప్పారు. 2 ప్లై, 3 ప్లై సర్జికల్ ఫేస్మాస్కుల ధరలను రూ. 8, రూ. 10గా కేంద్రం ఇది వరకే నిర్ణయించిన విషయం తెలిసిందే.