ఉరవకొండ ఆర్టీసీ బస్టాండ్లో కరోనా కలకలం
ABN , First Publish Date - 2020-07-09T21:28:41+05:30 IST
ఉరవకొండ ఆర్టీసీ బస్టాండ్లో కరోనా కలకలం రేపింది.
అనంతపురం జిల్లా: ఉరవకొండ ఆర్టీసీ బస్టాండ్లో కరోనా కలకలం రేపింది. జలుబు, దగ్గు, జ్వరంతో ఓ మహిళ ఆర్టీసీ బస్సాండ్లో సొమ్మసిల్లి కింద పడిపోయింది. కరోనా భయంతో ఆమె దగ్గరకు ఎవరూ వెళ్లలేదు. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని అంబులెన్స్లో ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కనెకల్ మండలం, ఎన్ హనుమాపురం గ్రామానికి చెందిన 50 ఏళ్ల మహిళగా గుర్తించారు. ఈనెల 1న ఆమెకు కరోనా నిర్ధారణ అయింది. అక్కడ ఐసోలేషన్లో ఉంచడంతో ఎవరూ పట్టించుకోలేదంటూ తప్పించుకుని ఉరవకొండకు వచ్చినట్లు సమాచారం.