జీజీహెచ్‌లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు

ABN , First Publish Date - 2020-03-29T11:26:06+05:30 IST

నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల(జీజీహెచ్‌) ను నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల ప్రాంతీయ

జీజీహెచ్‌లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు

పూణే నుంచి కిట్ల రాక

స్విమ్స్‌ నుంచి టెక్నీషియన్‌... 


నెల్లూరు (వైద్యం), మార్చి 28 : నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల(జీజీహెచ్‌) ను నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల ప్రాంతీయ కరోనా ఆసుపత్రిగా మార్చిన నేపథ్యం లో వ్యాధి నిర్థారణ పరీక్షలు కూడా ఇక్కడే జరిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని సమాచారం. ఇందుకు అవసరమైన మెడికల్‌ కిట్లను పూణే నుంచి తెప్పిస్తున్నారని, అలాగే వ్యాధి నిర్థారణ పరీక్షలు చేసేందుకు తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రి నుంచి టెక్నీషియన్‌ కూడా వస్తున్నారని సమాచారం.


ఒకటి, రెండు రోజుల్లో ఇవన్నీ సమకూరే అవకాశం ఉంది. మరోవైపు కరోనా అనుమానితులను ఆసుపత్రికి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రైవేటు అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. నెల్లూరులోని పలు ఆసుపత్రులకు చెందిన అంబులెన్స్‌లను జిల్లా ఎమర్జెన్సీ కేంద్రం వద్ద అందుబాటులో ఉంచారు. 

Updated Date - 2020-03-29T11:26:06+05:30 IST