జిల్లాలో 71 మందికి కరోనా నిర్ధారణ

ABN , First Publish Date - 2020-10-31T07:06:05+05:30 IST

జిల్లాలో కొత్తగా 71మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈమేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు

జిల్లాలో 71 మందికి కరోనా నిర్ధారణ

ఇద్దరు మృతి


కరీంనగర్‌, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి ప్రతి నిధి): జిల్లాలో కొత్తగా 71మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈమేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు. శుక్రవారం స్థానికుల సమాచారం మేరకు జిల్లాల్లో దాదాపు 140మంది వరకు కరోనా వ్యాధి సోకినట్లు తెలిసింది. కరీంనగర్‌ పట్టణం లోని కోతిరాంపూర్‌కు చెందిన 57ఏళ్ల వ్యక్తి కరోనాబారిన పడి చికిత్స పొందుతుండగా శుక్రవారం ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఆయనను హాస్పిటల్‌కు తరలిస్తుండగా  మృతిచెం దాడు. అలాగే గంగాధర మండలం రంగా రావుపల్లికి చెందిన 60ఏళ్ల మహిళకు గురువారం కరోనా నిర్ధారణ కాగా శుక్రవారం మృతిచెందింది. హుజూరాబాద్‌ డివిజన్‌ పరిధిలోని జమ్మి కుంట మండలంలో ఐదుగురు, హుజురాబాద్‌ మండలంలో 13మంది, సైదాపూర్‌ మండలంలో  ముగ్గురు, వీణవంకలో ఒకరు, శంకరపట్నం మండలంలో ఐదుగురు కరోనా వ్యాధిబారినపడ్డారు. అలాగే కరీంనగర్‌ డివిజన్‌ పరిధిలోని తిమ్మాపూర్‌ మండలంలో నలుగురికి, మానకొం డూర్‌ మండలంలో  ఆరుగురికి,  చొప్పదండి మండలంలో ఏడుగురికి, రామడుగులో ముగ్గురికి, గంగాధర మండలంలో ముగ్గురికి, చిగురుమా మిడి మండలంలో ఇద్దరికి వ్యాధిసోకింది. కరీంనగర్‌ పట్టణంలోని అశోక్‌నగర్‌కు చెందిన ఇద్దరికి, కోతిరాంపూర్‌కు చెందిన ఇద్దరికి, రాఘ వేంద్రనగర్‌కు చెందిన ఒకరికి పాజిటివ్‌ వచ్చింది.


బుట్టిరాజారాంకాలనీ కిసాన్‌నగర్‌కు చెందిన ఒకరికి, శివాజీనగర్‌కు చెందిన ఒకరికి, సప్తగిరి కాలనీతోపాటు ఆ పరిసర కాలనీలకు చెందిన ఎనిమిది మందికి, విద్యా నగర్‌లో ఐదుగురికి, మౌతాజ్‌ఖాన్‌ సబ్‌సెంటర్‌ పరిధిలో ఇద్దరికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. అలాగే కట్టరాంపూర్‌కు చెందిన ఐదుగురు, భగత్‌నగ ర్‌కు చెందిన నలుగురు, తిరుమల్‌నగర్‌కుచెందిన ఒకరు, వావిలాల పల్లికి చెందిన ఒకరు, కోతిరాంపూర్‌కు చెందిన ఒకరు, బొమ్మకల్‌కు చెందిన ఇద్దరు వైరస్‌ బారిన పడ్డారు. బుట్టిరాజారాం కాలనీలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆరుగురికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. 

Updated Date - 2020-10-31T07:06:05+05:30 IST