తెలంగాణలో ముగిసిన Corona థర్డ్ వేవ్... ఆంక్షలు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-02-08T18:59:11+05:30 IST

తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని డీహెచ్ శ్రీనివాస్ ప్రకటించారు.

తెలంగాణలో ముగిసిన Corona థర్డ్ వేవ్... ఆంక్షలు ఎత్తివేత

హైదరాబాద్: తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని డీహెచ్ శ్రీనివాస్ ప్రకటించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కరోనా మూడు వేవ్‌ల రూపంలో ప్రపంచాన్ని పట్టి పీడించిందన్నారు. తెలంగాణలో కరోనా పాజిటివీటి రేటు రెండు శాతం మాత్రమే ఉందని తెలిపారు. ఫస్ట్ వేవ్ 10 నెలలు, సెకండ్ వేవ్ 6 నెలలు, థర్డ్ వేవ్ మూడు నెలలు మాత్రమే ఉందని అన్నారు. ఎలాంటి ఆంక్షలు అక్కర్లేదన్నారు. కేంద్రం కూడా ఆంక్షలు ఎత్తివేసిందని డీహెచ్ చెప్పారు. 


ఇక వర్క్‌ ఫ్రంహోం అక్కర్లేదన్నారు. ఎన్ని వేరియంట్లు వచ్చినా ఎదుర్కోగలమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పట్లో కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం లేదన్నారు. వ్యాక్సిన్‌తోనే కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నామని తెలిపారు. కేసులు తగ్గినా ఫీవర్ సర్వే కొనసాగుతుందన్నారు. కరోనాను సీజనల్ ఫ్లూగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని డీహెచ్‌ శ్రీనివాస్ వెల్లడించారు. 

Updated Date - 2022-02-08T18:59:11+05:30 IST