దేశంలో 200 దాటిన కరోనా మరణాలు

ABN , First Publish Date - 2020-04-11T00:48:33+05:30 IST

కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 200 దాటింది. ఈ మేరకు ప్రభుత్వం..

దేశంలో 200 దాటిన కరోనా మరణాలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 200 దాటింది. ఈ మేరకు ప్రభుత్వం వివరాలను వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 6,761 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా వారిలో 206 మంది మరణించారని కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ తెలిపింది. ఇంకా 6,039 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, 516 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం వెల్లడించింది.

Updated Date - 2020-04-11T00:48:33+05:30 IST