రాజధానిలో 3వేలు దాటిన కరోనా మరణాలు

ABN , First Publish Date - 2020-07-05T01:15:38+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మరణాలు 3వేలు దాటేశాయి. తాజాగా నమోదవుతున్న కేసుల సంఖ్య కొద్దిగా...

రాజధానిలో 3వేలు దాటిన కరోనా మరణాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మరణాలు 3వేలు దాటేశాయి. తాజాగా నమోదవుతున్న కేసుల సంఖ్య కొద్దిగా తగ్గినప్పటికీ మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తూనే ఉంది. ఈ రోజు కూడా 50కి పైగా మరణాలు సంభవించాయి. దీనికి తోడు 2,500పైగా కొత్త కేసులను అధికారులు గుర్తించారు ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య  శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,505 కరోనా కేసులు నమోదయ్యాయి. 55 మంది మరణించారు. 2,632 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 97,200కి చేరింది. వీరిలో 25,940మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 68,256మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 3,004మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-07-05T01:15:38+05:30 IST