కరోనాతో ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-04-23T05:08:35+05:30 IST
మండలంలోని జంగాలకండ్రికలో ఓ వృద్ధుడు(65) బుధవారం రాత్రి కరోనా పాజిటివ్తో మృతిచెందాడు. ఈయన ఇటీవల గుండె పరీక్ష నిమిత్తం నెల్లూరులోని
సంగం, ఏప్రిల్ 22: మండలంలోని జంగాలకండ్రికలో ఓ వృద్ధుడు(65) బుధవారం రాత్రి కరోనా పాజిటివ్తో మృతిచెందాడు. ఈయన ఇటీవల గుండె పరీక్ష నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట అనారోగ్యంగా ఉండడంతో సంగం ప్రభుత్వ వైద్యశాలలో కరోనా పరీక్ష చేయించుకున్నాడు. పాజిటివ్ రావడంతో నెల్లూరు జీజీహెచ్లో చేరాడు. అక్కడ చికి త్స పొందుతూ ఆరోగ్యం విషమించి మృతి చెందాడు.
ఎంపీడీవోకు కరోనా పాజిటివ్
సంగం మండల పరిషత్ ఇన్చార్జి ఎంపీ డీవోకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన కు ఇటీవల అనారోగ్యంగా ఉండడంతో కరోనా పరీక్ష చేయించుకున్నారు. బుధవారం పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్లో ఉన్నారు.