వసతి గృహంలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2021-03-09T05:21:06+05:30 IST
మండలంలోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో సోమవారం కరోనా కలకలం సృష్టించింది. వసతి గృహంలో వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలింది.
ఐదుగురు విద్యార్థులకు పాజిటివ్
తలమడుగు, మార్చి 8: మండలంలోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో సోమవారం కరోనా కలకలం సృష్టించింది. వసతి గృహంలో వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వసతి గృహంలోని మిగతా విద్యార్థులను అధికారులు తమ తమ ఇళ్లకు పంపించారు.