వంగపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2021-09-04T23:14:50+05:30 IST
జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం వంగపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో
యాదాద్రి-భువనగిరి: జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం వంగపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. ప్రధానోపాధ్యాయులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. హోంక్వారంటైన్లోకి పలువురు ఉపాధ్యాయులు వెళ్లారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.