కిట్ల సరఫరా బాధ్యత ఇకపై మాదే: కేంద్రం
ABN , First Publish Date - 2020-04-10T06:23:35+05:30 IST
కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు అవసరమైన వైద్య పరికరాలు, కిట్లను ఇకపై తామే సరఫరా చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పీపీఈలు...
హైదరాబాద్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు అవసరమైన వైద్య పరికరాలు, కిట్లను ఇకపై తామే సరఫరా చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పీపీఈలు, వెంటిలేటర్లు, మాస్కులు, వైద్య పరికరాలు వంటి వాటిని సరిపడా నిల్వ చేసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొరత ఉంటే తమకు తెలియజేస్తే సమకూరుస్తామని పేర్కొంది.