ప్రభుత్వం ఆ పని ముందే చేసుండాల్సింది: మజుందార్ షా

ABN , First Publish Date - 2020-04-01T02:04:21+05:30 IST

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఇంకా పెరుగుతాయని బయోకాన్ ఎండీ, చైర్‌పర్సన్ కిరణ్ మంజుందార్ షా అన్నారు. అయితే దీని గురించి భారత్ భయపడాల్సిన...

ప్రభుత్వం ఆ పని ముందే చేసుండాల్సింది: మజుందార్ షా

న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు ప్రైవేట్ సంస్థల సహాయాన్ని తీసుకోవడంలో ప్రభుత్వం ఆలస్యం చేసిందని, పరిస్థితిని ఒంటిరిగా చక్కదిద్దాలని అనుకుందని, అయితే అది కుదరలేదని బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా అన్నారు. కానీ సరిపడా నిధులు లేకపోవడంతో అది కుదరక ఇప్పుడు ప్రైవేటు రంగానికి అనుమతిచ్చిందని అన్నారు. ఒక వేళ ప్రభుత్వం ఈ పని ముంచే చేసి ఉంటే బాగుండేదని షా అన్నారు. ప్రభుత్వం అనుమతివ్వడంతో ప్రస్తుతం ప్రైవేటు సంస్థలు కూడా రంగంలోకి దిగి ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా కరోనా బాధితులకు అన్ని విధాలుగా సాయాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. 


భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఇంకా పెరుగుతాయని బయోకాన్ ఎండీ, చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా అన్నారు. అయితే దీని గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే కరోనా వైరస్ బారిన పడినవారు ప్రాణాపాయ స్థితికి చేరుకోకుండా కాపాడగలితే దీనిని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదని, ముఖ్యంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య గురించి ఆలోచించేకంటే దీని తీవ్రతను తగ్గించడంపై ఎక్కువగా దృష్టి సారించాలని సూచించారు. 


ఇదిలా ఉంటే 24 గంటల్లో 227 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. వీటితో కలుపుకొని ఇప్పటివరకు దేశంలో 1251 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 32 మంది మృత్యువాత పడినట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. 

Updated Date - 2020-04-01T02:04:21+05:30 IST