భారత్లో 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-01-19T15:36:16+05:30 IST
భారత్పై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. దాదాపు 3 లక్షలకు చేరువలో ఉన్నాయి.
ఢిల్లీ : భారత్పై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. దాదాపు 3 లక్షలకు చేరువలో ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 2,82,970 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 441 మంది మృతి చెందారు. 1,88,157 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 18,31,000కి చేరింది. కోవిడ్ రోజువారీ పాజిటివిటీ రేటు 15.13 శాతంగా నమోదైంది. దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 8,961కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.