ప్రపంచవ్యాప్తంగా కోటి 15 లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-06T15:47:19+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. బాధితుల సంఖ్య కోటి 15 లక్షలు దాటింది.

ప్రపంచవ్యాప్తంగా కోటి 15 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. బాధితుల సంఖ్య కోటి 15 లక్షలు దాటింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,15,57,810 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 5,36,786 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 65,35,598 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల తీవ్రత నానాటికి పెరుగుతోంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 29,82,928 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,32,569 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 12,89,564 మంది కోలుకున్నారు. ఇక బ్రెజిల్‌తో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు 16,04,585 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 64,569 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 9,78,615 మంది కోలుకున్నారు. మరిన్ని వివరాలకు పై వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2020-07-06T15:47:19+05:30 IST