మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-07-30T06:57:19+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బుధ, గురువారాల నడుమ 24 గంటల్లో 392 మందికి కరోనా వైరస్‌ సోకగా ఆ వ్యవధిలోనే కొవిడ్‌తో నలుగురు మృతి చెందినట్టు అధికార యంత్రాంగం వెల్లడించింది.

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

 తాజాగా 392మందికి పాజిటివ్‌... నలుగురి మృతి


 తిరుపతి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బుధ, గురువారాల నడుమ 24 గంటల్లో 392 మందికి కరోనా వైరస్‌ సోకగా ఆ వ్యవధిలోనే కొవిడ్‌తో నలుగురు మృతి చెందినట్టు అధికార యంత్రాంగం వెల్లడించింది. గురువారం ఉదయం 9 గంటల సమయానికి జిల్లాలో 2806 మంది యాక్టివ్‌ పాజిటివ్‌ బాధితులు వున్నట్టు యంత్రాంగం గుర్తించింది. కాగా కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసులు, మరణాలతో జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 230399కు చేరగా కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 1726కు చేరింది. తాజా పాజిటివ్‌ కేసులు తిరుపతిలో 37, పీలేరులో 28, తిరుపతి రూరల్‌, పెనుమూరు మండలాల్లో 23 చొప్పున, చిత్తూరులో 21, మదనపల్లెలో 20, చంద్రగిరిలో 19, సదుంలో 13, పాకాల, గంగవరం మండలాల్లో 12 వంతున, రేణిగుంటలో 11, బంగారుపాళ్యంలో 10, శ్రీకాళహస్తి, పులిచెర్ల మండలాల్లో 8 వంతున, నగరి, తవణంపల్లె, కురబలకోట మండలాల్లో 6 చొప్పున, రొంపిచెర్లలో 5, పలమనేరు, కుప్పం, ఎర్రావారిపాళ్యం, గుడిపాల, సోమల, ఐరాల, కార్వేటినగరం, కలకడ, బి.కొత్తకోట, రామచంద్రాపురం, చిన్నగొట్టిగల్లు, బైరెడ్డిపల్లె, శ్రీరంగరాజపురం, వరదయ్యపాళ్యం, కలికిరి, పెద్దపంజాణి, వడమాలపేట మండలాల్లో 4 వంతున, పుత్తూరు, పూతలపట్టు, తొట్టంబేడు, రామకుప్పం, వి.కోట, యాదమరి, కేవీపల్లె, తంబళ్ళపల్లె, బీఎన్‌ కండ్రిగ, వాల్మీకిపురం, రామసముద్రం, విజయపురం, సత్యవేడు మండలాల్లో 3 చొప్పున, చౌడేపల్లె, వెదురుకుప్పం, కేవీబీపురం, నాగలాపురం మండలాల్లో 2 వంతున, ఏర్పేడు, నిమ్మనపల్లె, పుంగనూరు, జీడీనెల్లూరు, గుర్రంకొండ, నిండ్ర, పిచ్చాటూరు, పెద్దమండ్యం, పీటీఎం మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.


Updated Date - 2021-07-30T06:57:19+05:30 IST